The Presentation of Jesus in the Temple: Significance of the Catholic Feast by Srujan Segev
FULL TRANSCRIPT
మరియ తల్లి బలి అర్పించారు కానీ
ఏసుక్రీస్తు కోసం ఐదు శకలు 55 గ్రాముల
వెండి అనేది ఏసుక్రీస్తు కోసం అర్పించలేదు
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మరియ
తల్లి ఏసుక్రీస్తుని కంప్లీట్ గా దేవునికి
వదిలేసింది క్రీస్తు నందు యందు
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇవాళ
మనము నాలుగవ సామాన్య ఆదివారంలోకి
ప్రవేశిస్తున్నాము ఈ నాలుగవ సామాన్య
ఆదివారం రోజున మన కతోలిక శ్రీ సభ
వ్యాప్తంగా ఒక పెద్ద పండుగను
జరుపుకుంటున్నాము ఆ పండుగ పేరే దేవాలయమందు
రక్షకుని సమర్పణ ఉత్సవము అని
పిలుస్తున్నాము సింపుల్ గా మనకు అర్థమయ్యే
భాషలో చెప్పాలి అని అంటే ఏసుక్రీస్తుని
మరియ తల్లి జోసెఫ్లు కలిసి దేవాలయానికి
తీసుకొని వెళ్లి ఆ దేవాలయంలో అర్పించారు
దానినే కతోలిక స్త్రీ సభ ఒక పండుగగా
మలిచింది ఎందుకు దీన్ని పండుగగా మలిచింది
అనే దానికి చాలా పెద్ద వివరణ ఉంది ఇవాళ
మనం చదవబోతుంది పోయేటువంటి రీడింగ్స్
అన్నీ కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ
ఉన్నాయి మనం ఒక్కసారి గత నెల రోజుల నుంచి
జరుపుకున్నటువంటి పండుగలను అబ్సర్వ్
చేస్తే డిసెంబర్ 25 వ తేదీన మనము క్రీస్తు
జయంతి మహోత్సవాన్ని జరుపుకున్నాం ఆ తర్వాత
జనవరి 1వ తేదీన ఏసుక్రీస్తుకు సున్నతి
చేసి పేరు పెట్టిన రోజు ఆ పండుగను
జరుపుకున్నాం ఈ డిసెంబర్ 25 తర్వాత 40
రోజులకి అంటే ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత
దాదాపు 40 రోజులకి మనం ఈ పండుగ
జరుపుకున్నాం చేసుకుంటున్నాం అదే
దేవాలయంలో రక్షకుని సమర్పణ పండుగ కొన్ని
చోట్ల మీరు ఈ పదం కూడా వినే ఉంటారు కానుక
మాత దేవాలయం అని కూడా విని ఉంటారు మనం
జపమాల చెబుతూ ఉన్నప్పుడు కూడా జపమాలలో ఒక
గుర్తు చెప్తూ ఉంటాం బాల యేసును మరియ
తల్లి జోసప్పలు కలిసి దేవాలయంలో
సమర్పించుటను గురించి ధ్యానించుదుము గాక
అని జపమాలలో కూడా ఈ సందర్భాన్ని మనం
జ్ఞాపకం చేసుకుంటాం ఇన్ని చోట్ల ఈ పదం
కనిపిస్తుంది అని అంటే ఇన్ని చోట్ల ఒక
పండుగ కనిపిస్తూ ఉంది అని అంటే అది
చర్చికి ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ అని
మనం గుర్తు చేసుకోవాలి ఇవాళ కూడా మనకు
మూడు రీడింగ్స్ ఉన్నాయి మూడు రీడింగ్స్ లో
మొదటిది మలాకి నుంచి రెండవది హెబ్రీయులకు
రాసినటువంటి లేఖ మూడవది లూకా సువార్త
నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ సువార్త ఈ
సువార్తతో పాటుగా ఈ రెండు పట్టణాల్లో కూడా
మనకు ఒక అవినాభావ సంబంధం కనిపిస్తూ
ఉంటుంది అంటే ఈ మూడింటి మధ్య అవినాభావ
సంబంధం ఉంది మన మనకు మొదటి రీడింగ్
అర్థమైతేనే రెండోది అర్థమవుతుంది రెండోది
అర్థమైతేనే మూడోది అర్థమవుతుంది ఈ మూడు
కలిపితేనే అసలు ఈ పండుగ ఏమిటి ఈ పండుగ
వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి దీని
వెనుక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు
ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే
ఇవాళ మనం ఈ వీటి గురించి చర్చించుకుంటూ
వెళ్ళేటప్పుడు మనకు అనేక విషయాలు తెలుస్తూ
ఉంటాయి అందులో ఎక్కువ అంశాలు మనం వీటి
గురించి మాట్లాడుతాం అవేంటంటే దేవుడు
మనిషిగా రావడము యాజకత్వము నిర్మలమైన బలి
ప్రధాన యాజకుడు దేవాలయంలో ఏసుక్రీస్తు
అర్పణ మరియమ్మ పరిస్థితి ఎలా ఉంది ఆమె
చేసినటువంటి త్యాగం ఏమిటి ఈ అంశాల గురించి
ఇవాళ మనం చాలా లోతుగా
మాట్లాడుకోబోతున్నాము కాబట్టి ఆలస్యం
చేయకుండా మొదటి పట్టణంలోకి వెళ్దాము మొదటి
పట్టణాన్ని మనం గమనించినట్లయితే మలాకి
మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు
ఇవాళ మొదటి రీడింగ్ లో మనకు కనిపిస్తూ
ఉన్నాయి
ఇప్పుడు అసలు ఈ మలాకి ఎవరు అనే దగ్గర ఈ కథ
అంతా మొదలు పెడదాం ఎందుకంటే అది అర్థం
కాకపోతే మనకి రీడింగ్ అనేది పూర్తిగా
అర్థం కాదు మలాకి అనేటువంటి వ్యక్తి
ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి ఒక
ప్రవక్త లేదా యూదా ప్రాంతంలో ఉన్నటువంటి
ఒక ప్రవక్త అని చెప్పొచ్చు ఈ మలాకి
అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే నా దూత
అని మలాక్ అంటే దూత అని ఇప్పుడు ఇంగ్లీష్
భాషలో మనం ఏంజెల్ అని పిలుస్తాము ఆ దేవత
దూత అని చెప్పడానికి మనము ఏంజెల్ అనే మాట
వాడతాము సో ఈ మలాకిలో మలాక్ అంటే దేవదూత
అని అర్థము మనం తెలుగులో దేవదూత
అంటున్నాము హిబ్రూ భాషలో చెప్పాలంటే మలాక్
అంటాము అన్నమాట అంటే ఈ వ్యక్తి ఎలాంటి
వ్యక్తి ఈ వ్యక్తి రాసినటువంటి లేదా ఈ
వ్యక్తి తెలియజేసినటువంటి అంశాలు ఎలాంటివి
అని అంటే అవి దేవుని నుంచి వస్తున్నటువంటి
అంశాలు దేవదూత తెలియజేస్తున్నటువంటి
అంశాలు అని టూకీగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ
ప్రవక్త ఎప్పుడు చాడు అని అంటే మనం కొద్ది
రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం
ఏసుక్రీస్తుకి దాదాపు 600 సంవత్సరాల
క్రితం బబులోనీయులు వచ్చి దాడి చేశారు 500
ఏళ్ల క్రితం ఆ చెర నుంచి ఇజ్రాయిలీయులు
అందరూ విడుదల పొందారు 450 ఏళ్ల క్రితం
వాళ్ళు ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు
అంతవరకు జరిగింది పోయిన ఆదివారం మనం
రీడింగ్స్ లో కూడా మనం చూసాము నెహేమియాలో
చదువుతూ ఉన్నప్పుడు ఆ నెహమియా వచ్చి ఆ
ఇశ్రాయేలు యొక్క పట్టణ గోడలను కట్టడం మనం
చూస్తున్నాము ఈ మలాకి అనేటువంటి ప్రవక్త
ఎప్పుడు జీవించాడు అంటే నెహేమియా ఆ గోడలను
కట్టడానికి ముందు అలాగే దేవాలయాన్ని
కట్టుకున్న తర్వాత ఆ రెండిటికి మధ్య
జీవించినటువంటి వ్యక్తి ఈ మలాకి ఈ మలాకి
కంటే కొంచెం ముందు మాట్లాడినటువంటి
వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే
హగ్గయి ప్రవక్త జకరియా ప్రవక్త
వీళ్ళిద్దరూ మలాకి కంటే కొద్ది సంవత్సరాల
ముందు దేవుని యొక్క వాక్కును ప్రకటించారు
అంటే దేవాలయాన్ని కట్టేటప్పుడేమో హగ్గయి
జకరియాలు మాట్లాడారు దేవాలయాన్ని కట్టి
అయిపోయి ఆ దేవాలయం లో బలులున్నీ
అర్పిస్తున్నారు ప్రార్థనలు
చేసుకుంటున్నారు ఆ టైం లో మాట్లాడినటువంటి
వ్యక్తి మలాకి ఈ మలాకి తర్వాత నెహేమ్యా
వచ్చి ఆ ఇజ్రాయిల్ చుట్టూ గోడలు కట్టాడు
అప్పుడు ఎజ్రా వచ్చి ఆ పట్టణంలో
ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని
వాక్కును వినిపిస్తూ ఉన్నాడు ఇది టైం లైన్
అంటే ఎవరు ఎప్పుడు ఉన్నారు చరిత్రలో అనేది
మనం తెలుసుకున్నాము ఇప్పుడు అసలు ఇవాళ
రీడింగ్స్ ఏం చెప్తున్నాయి అనేది
గమనిద్దాము మలాకి మూడవ అధ్యాయం ఒకటి నుంచి
నాలుగు వచనాలు చూస్తే అందులో కొన్ని
కొన్ని అంశాలు చాలా కీలకంగా కనిపిస్తాయి
మలాకి ప్రవక్త వాటిని చాలా గాఢతతో చెప్పడం
మనం చూస్తాం ఉదాహరణకు మొదటి వచనంలో ఆయన
అంటాడు నా మార్గమును సిద్ధం చేయుటకు నాకు
ముందుగా నా దూతను పంపుదును అని దేవుడు
అంటున్నాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే
నా మార్గమును సిద్ధం చేయుటకు నాకు ముందుగా
అంటే దేవుడే రాబోతున్నాడు ఆయన రావడానికి
ముందుగా దేవదూతను ఒక వ్యక్తిని దూతను
పంపుదును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము
ఆ తర్వాత ఇంకొక ఒక మాట అంటున్నాడు అప్పుడు
మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిడీలున
దేవలమునకు వచ్చును మీరందరూ దేవుడు వస్తారు
అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే యెషయా
ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు మనం కొద్ది
వారాలుగా వాటినే ధ్యానిస్తూ ఉన్నాం యెషయా
ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది ఏంటి
ఇదిగో నేను మీ మధ్యకు రాబోతున్నాను మీ
మధ్యలో నివసించబోతున్నాను మిమ్మల్ని
అందరిని తిరిగి గొప్ప వైభవంగా
మార్చబోతున్నాను అని దేవుడు ఒక పక్క
చెబుతూ ఉన్నాడు దాని గురించి దేవుడు
మాట్లాడుతూ అంటున్నాడు నా మార్గమును
ముందుగా సిద్ధం చేసుకుంటాను సిద్ధం
చేయడానికి ఒక వ్యక్తిని పంపిస్తాను
పంపించిన తర్వాత ప్రభువు దిడీలన దేవలమునకు
వచ్చును అంటే దేవుడు ఉన్నట్టుండి
దేవాలయానికి వస్తాడు అని చెబుతూ ఉన్నాడు ఆ
తర్వాత ఇంకొక మాట అంటున్నాడు మీరు
చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా
వచ్చును ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఒక
మాట అంటాడు ఇదిగో నేను ఇశ్రాయేలీయులతో ఒక
నూతన నిబంధన చేసుకోబోతున్నాను ఆ నూతన
నిబంధన అనేది వారి యొక్క హృదయాల పైన
రాస్తాను అని చెప్పి ఇర్మియా గ్రంధంలోనే
దేవుడు చెప్పాడు దానినే మన మలాకీ ప్రవక్త
గారు మరల ఇంకొంచెం విశదీకరిస్తూ
అంటున్నాడు మీరు చూడగోరుచున్న నిబంధన దూత
శీఘ్రముగా వచ్చును అంటే మీరందరూ ఎదురు
చూస్తున్నారు ఏమని ఒక నూతన నిబంధన
రాబోతుంది దేవుడు రాబోతున్నాడు దేవుడు
వచ్చి మమ్మల్ని అందరిని మహిమకరంగా
మార్చబోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు
కదా ఆయన రాబోతున్నాడు ఆయన ఉన్నట్టుండి
దేవాలయానికి వస్తాడు అంతేకాదు ఆయన
శీఘ్రంగా వస్తాడు అంటే వేగంగా త్వరలో
వెంటనే రాబోతున్నాడు అని చెబుతున్నాడు
ఇంకా ఆ తర్వాత ఒక హెచ్చరిక చేస్తున్నాడు
మలాకి ప్రవక్త ఆయన ఏమంటున్నాడు అంటే ఇదిగో
ఆయన వచ్చుచున్నాడు కానీ అతడు వేంచేయు
దినమును భరింపగల వాడు ఎవడు దేవుడు
రాబోతున్నాడు బాగానే ఉంది కానీ ఆయన ఆయన
వచ్చేటువంటి రోజుని భరించగలిగేటువంటి
వాళ్ళు ఎవరున్నారు ఎందుకంటే ఇంకా
మాట్లాడుతూ అంటున్నాడు అతని ఎదుట
నిలబడగలిగిన వాడు ఎవడు అతడు చాకలి వాని
సబ్బు వంటి వాడు లోహములను శుద్ధి చేయు
కంసాలి అగ్ని వంటి వాడు అతడు వెండిని
పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి
తీర్పు చెప్పును లోహకారుడు వెండి
బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత
యాజకులను శుద్ధి చేయును ఇక్కడ ఏమంటున్నాడు
అంటే దేవుడు నేను రాబోతున్నాను ఆ రాబోయేది
ఒక నిబంధన దూతగా రాబోతున్నాడు అని
చెబుతూనే ఆ దూత వచ్చినప్పుడు ఎవరు
భరించగలరు ఎందుకని అంటే రాబోయేటువంటి
వ్యక్తి ముందట నిలబడాలి అని అంటే అంత
సాధ్యమైన విషయం కాదు ఎందుకని అంటే
రాబోయేటువంటి వ్యక్తి పవిత్రుడు ఎంత
పవిత్రుడు అని అంటే అప్పటివరకు ఉన్నటువంటి
యాజక వ్యవస్థను శుద్ధి చేయబోతున్నాడు అని
చెప్పాడు అంతే కాదు ఆయన గురించి ఇంకా
వర్ణిస్తూ వెండిని పుటము వేసి శుద్ధి చేయు
వాని వలె వచ్చి తీర్పు చెప్పును వెండిని
పుటం వేయడము అని అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక
ఐరన్ రాడ్ ని వంచాలనుకోండి ఆ ఐరన్ రాడ్ ని
చాలా మంట పెట్టి దాన్ని వేడి చేయాలి అది
ఎర్రగా మారిన తర్వాత అప్పుడు మాత్రమే
వంగుతుంది మామూలు సమయంలో వంగదు అంటే ఇక్కడ
ఆ పోలిక పోలుస్తున్నాడు అని అంటే తప్పులు
చేస్తున్నటువంటి వారందరినీ దేవుడు వంచి
వేడి చేసి మరి వంచబోతున్నాడు వాళ్ళందరినీ
మార్చబోతున్నాడు వాళ్ళని మార్చడము
సంతోషకరమైన విషయమే కానీ మార్చడం ఎలా
జరుగుతుంది అని అంటే వారిని పుటం
వేసినట్లుగా అంటే అది కొంచెం శ్రమతో
కూడుకున్నది బాధతో కూడుకున్నది ఎవరికీ
అపవిత్రంగా జీవించే వాళ్ళందరికీ కూడా అది
బాధతో కూడుకున్నది అని చెప్తున్నాడు ఆ
తర్వాత ఆయన వచ్చి ఆ విధంగా శుద్ధి చేసిన
తర్వాత అందువలన వారు అతనికి యోగ్యమైన
బలిని అర్పిస్తారు అప్పుడు యూదా ఎరుషలేము
వాసులు ప్రభువు ప్రభువునకు బలులు అర్పించు
బలులు పూర్వకాలమునందువలె అతనికి ప్రీతి
పాత్రములగును ఈ యాజకులను శుద్ధి చేసిన
తర్వాత యాజకులు ఏవైతే బలులు
అర్పిస్తున్నారో ఆ బలులన్నింటిని దేవుడు
స్వీకరిస్తాడు ఎందుకంటే యాజకులు ఇప్పుడు
సరిగా లేరు కాబట్టి దేవుడు వచ్చి
వాళ్ళందరినీ శుద్ధి చేయబోతున్నాడు శుద్ధి
చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి అతనికి
దేవునికి
యోగ్యమైనటువంటి బలిని అర్పించబోతున్నారు
అప్పుడు యూదా ఎరుషలేము వాసులందరూ
ప్రభువునకు అర్పించు బలులన్నీ కూడా
పూర్వకాలం నందువలె అతనికి ప్రీతి
పాత్రములగును అంటే ఇప్పుడు దేవుడు బలులను
స్వీకరించడం లేదు కానీ ఎప్పుడైతే దేవుడు
వచ్చి వాళ్ళందరిని శుద్ధి చేసి ఆ తర్వాత
ఏం జరుగుతుంది అంటే యోగ్యమైన బలిని
అర్పించబోతున్నారో అప్పుడు దేవుడు ఆ బలిని
స్వీకరిస్తాడు ఇవి ఈ రీడింగ్ లో
చెబుతున్నటువంటి అంశాలు ఈ అంశాలన్నీ
ఎందుకు చెప్తున్నాడో తెలియకపోతే మనకి
ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అర్థం కాదు
బాగానే ఉంది దేవుడు ఏమంటున్నాడు దేవుడు
రాబోతున్నాడు ఓకే వస్తాడు యాజకులను శుద్ధి
చేస్తాడు ఓకే శుద్ధి చేసిన తర్వాత ఆ
బలులన్నింటిని స్వీకరిస్తాడు ఓకే ఇందులో
మూడు ముక్కలే కదా తెగిపోయింది కదా అని
అనుకుంటాం కానీ దీని వెనుక భావం అర్థం
కావాలని అంటే ఈ మలాకీ ప్రవక్తని ఇంకొంచెం
లోతుగా చదవాలి ఏ సందర్భంలో ఈ మాటలు
చెప్తున్నాడు అనేది కూడా మనం అర్థం
చేసుకోవాలి మనం గతం నుంచి మాట్లాడుతూ
ఉన్నదే ఇశ్రాయేలీయులని బబులోను అనేటువంటి
సామ్రాజ్యం వచ్చి వాళ్ళని ఓడించి బందీలుగా
తీసుకొని పోయింది బందీలుగా తీసుకొని పోయి
వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు తర్వాత
70 ఏళ్ల తర్వాత పర్షియా సామ్రాజ్యము అనేది
వచ్చి బబులోను ఓడించి బబులోనులో బందీలుగా
ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరిని మీరు మీ
దేశానికి తిరిగి వెళ్ళండి అని చెప్పడం
చూసాము వాళ్ళందరూ తిరిగి దేవాలయానికి
వచ్చారు సారీ తిరిగి ఇశ్రాయేలుకు వచ్చారు
అక్కడ దేవాలయం లేదు ఇల్లు లేవు అయితే
దేవుడు వాళ్లకు వాగ్దానం చేశాడు ఏమని
మీరందరూ తిరిగి ఆ పట్టణాన్ని
పునర్నిర్మించుకోబోతున్నారు మీరందరూ
సంతోషకరంగా జీవించబోతున్నారని యెషయా
గ్రంధం ద్వారా పలుమార్లు చెప్పడం మనం
కొన్ని ఆదివారాల నుంచి వింటూనే వస్తున్నాం
దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళందరూ
దేవాలయాన్ని కట్టుకున్నారు మంచిగా ఇల్లులు
కట్టుకున్నారు ఆ తర్వాత పంటలు పండడం
ప్రారంభమయ్యాయి మంచిగా పశు సంపద పెరగడం
ప్రారంభమైంది ఈ విధంగా వాళ్ళు పూర్వకాల
జీవితం ఏదైతే ఉందో ఆ జీవితానికి వచ్చేసారు
ఈ మలాకి ప్రవక్త వచ్చే నాటికి ఆ పాతగా
అంతకు ముందు మంచిగా ఏ విధంగా అయితే
ఉన్నారో అలాంటి జీవితం జీవించే స్థితికి
వచ్చేసారు అయితే
దేవుడు వాళ్ళు న్యాయంగా జీవిస్తారు అని
ఆశించాడు కానీ వీళ్ళు మాత్రం న్యాయంగా
జీవించడం లేదు వాళ్ళు దేవుని యొక్క
ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించడం మొదలు
పెట్టారు వీళ్ళు బబులోనులో ఇబ్బందులు
పడ్డారు కదా ఇప్పుడు నేను వాళ్ళని
విడిపించాను వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన
తర్వాత దేవాలయాన్ని కట్టుకున్న తర్వాత
మంచిగా వచ్చి బలులు అర్పిస్తారు మంచిగా
జీవిస్తారు నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు
అని దేవుడు అనుకున్నాడు ఆ దేవుడు ఆశించాడు
కానీ ఇశ్రాయేలీయులను చూస్తే వాళ్ళు వెంటనే
మాట తప్పిపోయారు మాట తప్పిపోయి దేవునికి
ఇచ్చేటువంటి బలుల్లో లోటుపాట్లు ఉన్నవి
ఇవ్వడం మొదలు పెట్టారు దేవుడు న్యాయం
బతకమని చెప్తే వీళ్ళు అన్యాయాలు చేయడం
ప్రారంభించారు అనేకమంది పట్ల వివక్ష చూపడం
ప్రారంభించారు ఆ ఇశ్రాయేలీయులను దేవుడు
ఎలా కోరుకున్నాడో అలా కాకుండా
పడిపోయినటువంటి జీవితంలో దారుణమైనటువంటి
జీవితంలో జీవించడం మొదలు పెట్టారు ఇదంతా
ఒక ఎత్తు అయితే వీళ్ళందరూ తప్పు
చేస్తున్నప్పుడు ఖండించాల్సింది యాజకులు
అంటే ఆనాటి బలులు అర్పించేటువంటి యాజకులు
అంటే ఆనాటి మన ఇప్పుడు ఫాదర్ల లాగా
పాస్టర్ల లాగా ఆనాడు యాజకులు ఉన్నారు
అలాంటి యాజకులు వీళ్ళందరినీ ఖండించి
ఖండించి మీరు తప్పు చేస్తున్నారు అని
చెప్పాలి కానీ ఏం జరిగింది అని అంటే
దేవాలయాన్ని కట్టుకున్న తర్వాత యాజకులే
మార్గం తప్పిపోయారు వాళ్ళు అర్పించేటువంటి
బలుల్లో లోటుపాట్లు ఉంటున్నాయి దేవుడే కదా
ఏదో ఒకటి తీసేసుకుంటాడులే అని బలులు
అర్పించడం మొదలు పెట్టారు దేవుడు
ఇచ్చినటువంటి ఆజ్ఞలకు విరుద్ధంగా
ప్రవర్తించడం మొదలు పెట్టారు అంటే అటు
ప్రజలు చెడిపోయారు ఇటు యాజకులు చెడిపోయారు
ఆ నేపథ్యంలో దేవుడు ఈ మాటలు చెబుతూ
ఉన్నాడు అయితే ఈ యాజకుల గురించి కూడా
దేవుడు మలాకి గ్రంధంలోనే చెప్పాడు ఇవాళ మన
రీడింగ్ వచ్చేసి మలాకి మూడవ అధ్యాయము కానీ
మలాకి ఒకటవ అధ్యాయంలో చదివితే ఒకటి ఒకటవ
అధ్యాయం ఆరు నుంచి 10 వచనాల్లో ఈ విధంగా
ఉంది జాగ్రత్తగా వినండి ఇశ్రాయేలీ ప్రజలు
యాజకులు ఎంతగా చెడిపోయారో వినండి అలాగే
మనము కూడా మనం దేవునికి ఏదైనా
ఇచ్చేటప్పుడు మనం కూడా ఇలాంటి తప్పులే
చేస్తూ ఉంటాము వీళ్ళు ఏ విధంగా
ప్రవర్తించారో మనం కూడా అలాగే
ప్రవర్తిస్తూ ఉంటాం అవేంటో నేను నిదానంగా
చదువుతాను వీటిని వింటూ ఉన్న అప్పుడు నేను
ఎలాంటి తప్పులు చేస్తున్నాను నా జీవితంలో
అనేదాన్ని కూడా గుర్తు చేసుకోండి అలాగే
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యాజకులు అయితేనేమి
ప్రజలు అయితేనేమి ఏ విధంగా చెడిపోయారో
జాగ్రత్తగా వినండి ఆరవ వచనం నుంచి 10వ
వచనం
వరకు సైన్యములకు అధిపతియగు ప్రభువు
యాజకులతో
ఇట్లనుచున్నాడు కుమారుడు తండ్రిని
గౌరవించును సేవకుడు యజమానుని గౌరవించును
నేను మీకు తండ్రిని మీరు నన్ను నేల
గౌరవింపరు నేను మీకు యజమానుడను మీరు నాకేల
భయపడరు మీరు నన్ను చిన్నచూపు చూచుచున్నారు
అయినను మేము నిన్ను ఏ రీతిన చిన్నచూపు
చూసితిమి అని మీరు అడుగుచున్నారు నా
బలిపీఠముపై అపవిత్రమైన ఆహారమును అర్పించుట
ద్వారా మీరు నన్ను చిన్నచూపు చూచుచున్నారు
అయినను మీరు మేము నిన్ను ఎట్లు
కించపరిచితిమి అని ప్రశ్నించుచున్నారు నా
భోజనపు బల్లను హీనపరచుట ద్వారానే అని నేను
చెప్పుచున్నాను మీరు కుంటిదియో గుడ్డిది
జబ్బుగానున్న ఒక పశువును నాకు బలిగా
ఇచ్చినప్పుడు అది తప్పు కాదా మీరు అట్టి
దానిని మీ అధికారికి అర్పించినచో అతడు మీ
పట్ల దయచూపునా మీ కోరికలు తీర్చునా అని
సైన్యములకు అధిపతి అయిన ప్రభువు
అడుగుచున్నాడు యాజకులారా ప్రభువును మీపై
దయచూపమని వేడుకొనుడు అది మీ వల్లనే
జరిగెను కదా ఇట్టి అర్పణమును అర్పించుట
ద్వారా ఆయన మీలో ఎవరినైనా అంగీకరించునా
అని సైన్యములకు అధిపతియగు ప్రభువు
చెప్పుచున్నాడు సైన్యములకు అధిపతి అయిన
ప్రభువు ఇట్లనుచున్నాడు మీరు నా
బలిపీఠముపై నిరుపయోగముగా నిప్పులను
సిద్ధము చేయకుండునట్లు ఎవరైనా దేవాలయ
ద్వారములు మూసివేసినచో ఎంత బాగుండును నాకు
మీపై ప్రీతి లేదు నేను మీ బలులను
అంగీకరింపను
దేవుడు చూడండి ఎంత బాధతో చెప్తున్నాడు
అంటే తండ్రిని గౌరవించడం బిడ్డలకు తెలుసు
కదా యజమానుడికి లేదా మన ఉద్యోగం మనకు
ఉద్యోగంలో పై అధికారిగా ఉన్నటువంటి
వ్యక్తి దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని
మరి సార్ సార్ అని అంటాం కదా ఒక బిషప్ ఒక
ఫాదర్ వచ్చినప్పుడు వంగి మరి వాళ్ళ కాళ్ళు
నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తాం కదా మరి
అలాంటిది దేవునికి ఎంత గౌరవం చూపించాలి
కానీ మనం ఏం చేస్తాము ఇదిగో పాత నిబంధనలో
ఇశ్రాయేలీయులు చేసినట్లుగా ఆ దేవునికి బలి
అర్పించేటప్పుడు ఏం చేస్తారు అని అంటే
వాళ్ళు ఇశ్రాయేలీయులు మంచిగా ఉన్నటువంటి
ఒక గొర్రెపిల్లను మంచిగా ఉన్నటువంటి ఒక
బలిని అర్పించకుండా ఒక కుంటిదో గుడ్డిదో
జబ్బుదో ఉన్నటువంటి ఒక గొర్రెను తీసుకొని
వెళ్లి బలి అర్పిస్తున్నారు అంటే దేవునికి
ఇచ్చే దాంట్లో ది బెస్ట్ ఇవ్వట్లేదు
వాళ్ళు ఏదైతే మంచిదో మన దగ్గర ఉన్న వాటిలో
మంచి దాన్ని ఇవ్వట్లేదు బదులుగా వాళ్ళు ఏం
చేస్తున్నారు ఏదైతే చెడిపోయి ఉందో అలాంటి
వాటిని ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం
కూడా చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే
చినిగిపోయిన నోట్లు వేస్తుంటాం చూడండి
అంటే వాళ్ళు ఆనాడు ఎలా చేశారో ఈరోజు మనం
అలాగే చేస్తూ ఉంటాము ఈ విధంగా మనము దేవుని
బలిపీఠం దగ్గరికి అపవిత్రమైన వాటిని మనం
తీసుకెళ్లడం ద్వారా మనం తప్పు
చేస్తున్నాము దేవుని బలిపీఠం దగ్గరికి
వెళ్ళినప్పుడు మనము చెడు కార్యాలు చేసి
ఉండడం ద్వారా మనం దేవుణ్ణి అవమాన
పరుస్తున్నాము దేవుడు ఒక మాట అంటున్నాడు
చూడండి ఎంత బాధాకరమైన మాట మీరు
నిరుపయోగముగా నిప్పులను సిద్ధము
చేయకుండునట్లు ఎవరైనా దేవాలయపు ద్వారములు
మూసివేసినచో ఎంత బాగుండును అంటే మీరు
వచ్చి తప్పుడు బలులు అర్పించే దానికంటే ఆ
దేవాలయ తలుపులు ఎవడైనా మూసేస్తే ఎంత
బాగుండు అని దేవుడు అంటున్నాడు అంటే ఎంత
బాధాకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలీయులు
ఎంతగా చెడిపోయారు చూడండి సేమ్ ఇలాంటి
పరిస్థితిలోనే మనం ఉంటాం అందుకనే మలాకి
ప్రవక్త చాలా ఖండితంగా చెప్తున్నాడు
దేవుని తరపున దేవుడు రాబోతున్నాడు ఆయన
సడన్ గా వస్తాడు మీరు ఈరోజు ఏదో ఒకటి ఏదో
ఒకటి దేవునికి ఇచ్చేద్దాంలే అని
అనుకోవచ్చు కానీ దేవుడు సడన్ గా దిడీలు
వస్తాడు శీఘ్రంగా వస్తాడు ఆయన
వచ్చినప్పుడు నిలబడగలిగిన వాడు ఎవడు
ఎందుకని అంటే ఇక్కడ అర్పిస్తున్నవన్నీ
కూడా తప్పుడు బలులు అలాంటప్పుడు దేవుని
ఎదుట మనం ఎలా పవిత్రంగా నిలబడగలము అని
అంటున్నాడు అయితే దేవుడు ఇంకొక నిరీక్షణ
కూడా కల్పిస్తున్నాడు ఇది ఇంతటితో ఆగిపోదు
బదులుగా రానున్న కాలంలో ఏం జరగబోతుంది
అనేది ఆయనే మాట్లాడుతూ లోహకారుడు వెండి
బంగారం పుటం వేసినట్లే ప్రభువు దూత
యాజకులను శుద్ధి చేయును అందువలన వారు
అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు అప్పుడు
యూదా ఎరుషలేము వాసులు ప్రభువునకు అర్పించు
బలులు పూర్వకాలమునందువలె అతనికి ప్రీతి
పాత్రములగును అంటే దేవుడు రాబోతున్నాడు
వచ్చి యాజకులను శుద్ధి చేస్తాడు శుద్ధి
చేసిన తర్వాత వారు యోగ్యమైన బలిని
అర్పిస్తారు అని ముందుగానే చెబుతున్నాడు
ఇదే మనం ఇంకొక మాటలో కూడా చూస్తాం మలాకి
ఒకటవ అధ్యాయం 11వ వచనంలో చూస్తే సూర్యోదయం
మొదలుకొని సూర్యాస్తమయం వరకు నా నామము
వివిధ జాతులలో ఘనముగా ఎంచబడును వారు ఎల్ల
యెడల నాకు సాంబ్రాణి పొగ వేసి నిర్మలమైన
అర్పణమును అర్పించుదురు ఏలైనా నా నామము
సమస్త జాతులలోనూ ఘనమైనది సైన్యములకు
అధిపతియగు ప్రభువు వాక్కు ఇది అంటే దేవుడు
ముందుగానే చెప్తున్నాడు సూర్యోదయం
మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని నామం
పేరిట ఎల్ల యెడల సాంబ్రాణి వేసి బలి
నిర్మలమైనటువంటి బలి నిర్మలమైనటువంటి బలి
అర్పించే రోజు రాబోతుంది అని దేవుడు
చెబుతున్నాడు ఈ విధంగా మలాకి ప్రవక్త
ద్వారా మనం దేవుని సన్నిధికి
వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనం
ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాము దేవుని
సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నాము
దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం
తీసుకెళ్తున్నాము దేవుని సన్నిధికి
వెళ్ళినప్పుడు అక్కడ మన సోదరుల పట్ల
ఎలాంటి కోప భావాన్ని ద్వేష భావాన్ని ఇంకా
కలిగి ఉన్నాము ఎందుకని అంటే ఒక బలిపీఠం
మీదకి ఒక పనికిరాని వస్తువును తీసుకొని
వెళ్లి దాని మీద పెట్టడం ఎంత పాపమో అలాగే
మనం దేవాలయంలో ఉండగా దేవుని యొక్క ఆలయంలో
మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో
ఇతరుల మీద కోపాన్ని పెట్టుకొని ఉంటే
ద్వేషాన్ని పెట్టుకొని ఉంటే అవన్నీ కూడా
అటువంటి నిరుపయోగమైనటువంటి బలి లాంటిదే
అపవిత్రమైన అపవిత్రమైన దాన్ని మన
హృదయాల్లో ఉంచుకున్నట్టే అనే అంశాన్ని
గుర్తుపెట్టుకోవాలి ఇది మొదటి రీడింగ్ కి
సంబంధించినటువంటి విషయం ఇక రెండవ రీడింగ్
ని మనం పరిశీలించినట్లయితే హెబ్రీయులకు
రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయము 14 నుంచి
18 వచనాలు ఇవాళ మనం చదువుతున్నాము ఈ
రీడింగ్ లో ప్రత్యేకించి ఏసుక్రీస్తు
మాట్లాడటం చూస్తాము అయితే ముందుగా ఈ
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఎవరు
రాశారు అనేది గమనించినట్లయితే సంప్రదాయం
ప్రకారం పౌలు అని చెబుతున్నారు పౌలు గారు
హెబ్రీయులకు రాసినటువంటి లేఖను రాశారు అని
చెబుతుంటారు అయితే పౌలు గారు రాసినటువంటి
ఇతర లేఖలతో పోలిస్తే ఈ లేఖలు
విభిన్నమైనటువంటి అంశాలు కనిపిస్తాయి రచన
శైలిలో కూడా విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది
అందువల్ల ఇది పౌలు గారు రాయలేదు అని
చెబుతూ ఉంటారు అయితే సంప్రదాయం ప్రకారం
మనం చెప్పడం మాత్రం పౌలు గారు అని చెబుతూ
ఉంటాం ఈ లేఖను ఎప్పుడు రాశారు అని అంటే
క్రీస్తు శకం 70 కి ముందు ఈ లేఖను రాశారు
అని చెప్పొచ్చు అంటే ఏసుక్రీస్తు మరణించి
తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం
అయిపోయినటువంటి ఒక 30 40 ఏళ్ల లోపు ఈ
లేఖను రాశారు అన్నమాట ఈ లేఖలో ఇవాళ మనం
చదువుతున్నటువంటి రీడింగ్స్ లో ఏమున్నాయి
అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే అక్కడ
ఏసుక్రీస్తు మాట్లాడటం మనకు కనిపిస్తూ
ఉంది ఆయన మాట్లాడితే ఈ విధంగా అంటున్నాడు
విందాము ఒకసారి తాను పుత్రులను పిలుచు
వారు రక్త
మాంసపూరితమగు రక్త మాంస పూరితములగు
శరీరములు కలవారగుటచే తానును వారి వలె
అగుటయే గాక వారి మానవ స్వభావమునందు తానును
భాగస్వామి అయ్యెను ఇక్కడ ఏసుక్రీస్తు
గురించి మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు
తనను తాను తగ్గించుకొని భూలోకానికి
వచ్చాడు భూలోకానికి వచ్చి తన చుట్టూ
ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్కును
ప్రకటిస్తున్నాడు ఆ చుట్టూ ఉన్నటువంటి
ప్రజలందరూ అంటే దేవునికి పుత్రులు ఎవరైతే
ఉన్నారో ప్రజలందరూ రక్త మాంస పూరితులగు
శరీరములు గలవారు అంటే మనమందరికీ రక్తం
ఉంది మాంసం ఉంది శరీరం ఉంది మనలో ఆ
పడిపోయేటువంటి ఆ స్వభావం ఉంటుంది మనలో
నొప్పి తట్టుకోలేనటువంటి స్వభావం ఉంటుంది
మనలో అనేక రకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి
అందుకని ఏసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే ఈ
లోకానికి వచ్చినప్పుడు మనలాంటి శరీరాన్నే
ధరించుకున్నాడు వారి వంటి మానవ
స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను
ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా మనం ఈ
శరీరంలో ఉన్నాము కాబట్టి దేవుడు కూడా ఈ
శరీరంలోకి దిగి వచ్చాడు అలాంటి మానవ
స్వభావాన్ని ఆయన కూడా ధరించుకొని మనందరిలో
భాగస్వామి అయ్యాడు ఆ తర్వాత మాట్లాడుతూ
అంటున్నాడు మృత్యువుకు మృత్యువుపై
అధికారము గల సైతానును తన మరణం ద్వారా
నశింపజేయుటకు తద్వారా మృత్యు భయము చేత తమ
జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి
విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లు
అయ్యెను సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే
మనిషి అనేవాడు పుట్టాడు వాడు చనిపోతాడు
చనిపోయిన తర్వాత వాడికంటూ ఇంకా ఏమీ లేదు
అని భావిస్తున్నారు అయితే అలా కాదు దేవుడే
మనిషిగా దిగి వచ్చి మనలో ఒకడు అయ్యాడు
మనలో భాగస్వామి అయ్యాడు మరణించాడు ఆయన
కూడా మరణించిన తర్వాత తిరిగి లేచాడు
తిరిగి లేవడం ద్వారా మరణం మీద విజయాన్ని
సాధించాడు కాబట్టి ఈ మరణంతో జీవితం అంతం
కాదు అనేటువంటి విషయాన్ని
తెలియజేస్తున్నాడు మృత్యు భయం చేత
ఉన్నటువంటి వారికి విముక్తిని
ప్రసాదించాడు మనం కూడా మరణము అనగానే
భయపడతాము మరణం తర్వాత ఏం జరుగుతుందో అని
భయపడతాము కానీ అది ఒక విముక్తి ఈ లోకమును
విడిచిన తర్వాత మనం దేవుని దగ్గరకు
వెళతాము అని ఏసుక్రీస్తు నిరూపించాడు ఆ
తర్వాత ఇంకొక మాట మాట్లాడుతూ ప్రజల పాపముల
పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును
దయామయుడును అగు ప్రధాన యాజకుడు అగుటకు
గాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలిన
వాడు కావలసి వచ్చెనని దీని భావము ఈ మాట
వెంటనే అర్థం కాకపోవచ్చు ఇందులో ప్రధాన
యాజకుడు అనే పదం కనిపిస్తుంది ఇక్కడ రచయిత
చెబుతున్నది ఏంటి అని అంటే మనుషులందరూ
మనతో పాటే
ఉన్నారు
మనుషులందరూ మనుషులందరూ ఉన్నారు ఇక్కడ ఈ
మనుషుల్లో దేవుడు ఒక వ్యక్తిని
ప్రత్యేకంగా ఎంచుకున్నాడు అతన్ని ప్రధాన
యాజకుడు అని పిలుస్తారు ఉదాహరణకి మన
వ్యవస్థతో పోల్చాలి అని అంటే మన ఒక బిషప్
గారు అనుకోండి ఇప్పుడు మన డయాసిస్ లో లేదా
మన యొక్క మేత్రాసనాలు లేదా మన యొక్క అగ్ర
మేత్రాసనాల్లో ఒక బిషప్ గారు ఏ విధంగా
అయితే ఉంటారో ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో
ప్రధాన యాజకుడు అనేటువంటి వ్యక్తి
ఉండేవాడు ఈ ఇశ్రాయేలీయుల మొత్తానికి
ఆధ్యాత్మికంగా పెద్ద ఆ వ్యక్తి మనకు
మేత్రాసన స్థాయిలో అయితే బిషప్ గారు
ప్రపంచ స్థాయిలో అయితే పోపు గారు మనకు ఏ
విధంగా ఆధ్యాత్మిక నాయకుడిగా ఉంటారో ఆ
విధంగా
ఇశ్రాయేలీయులకి ప్రధాన యాజకుడు అనేటువంటి
వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి ఈ మతానికి
మొత్తానికి ఒక పెద్ద లాగా చెప్పొచ్చు
అన్నమాట ఇప్పుడు ఏసుక్రీస్తు ఏమవుతున్నాడు
అంటే ప్రజల పాపముల పరిహారార్థము ఈయనే
ప్రధాన యాజకుడిగా మారాడు అంటే ఏసుక్రీస్తే
స్వయంగా ఒక ప్రధాన యాజకుడిగా మారి ఆనాటి
ప్రధాన యాజకులు ఏదైతే చేయలేకపోయారో అది
ఈయన చేస్తున్నాడు ఎందుకని అంటే మనం మలాకి
ప్రవక్త గ్రంధంలోనే చెబుతూ ఉండగా మనం
చూసాము ఆనాడు ఉన్నటువంటి యాజకులందరూ
చెడిపోయారు మరి యాజకులందరినీ
సరిదిద్దాల్సిన వాడు ఎవడు ప్రధాన యాజకుడు
ఆ ప్రధాన యాజకుడు కూడా ఏ స్థితిలో ఉన్నాడో
తెలియదు అందుకని ఇప్పుడు ఏమైంది అంటే
ఏసుక్రీస్తే ప్రధాన యాజకుడిగా మారాడు అంటే
ఇక మీదట యాజకుల్లో లోపము అనేది ఉండదు అని
ఇండైరెక్ట్ గా ఇక్కడ చెబుతున్నాడు ఇంకొక
మాట కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు తాను
శోధింపబడి వ్యధును గనుక ఇప్పుడు ఆయన
శోధింపబడు వారికి సాయపడగలడు
యేసు క్రీస్తు అన్ని విధాలా మన మన యొక్క
జీవితంలో భాగమయ్యాడు ఉదాహరణకి సృజన అనే
నేను ఉన్నాను నా ఇంట్లో ఎవరైనా
మరణించినప్పుడు నేను ఏడుస్తాను దుఃఖ
పడతాను బాధపడతాను ఒక రకంగా చెప్పాలంటే
కృంగిపోతాను అలాగే లాజరు అనేటువంటి
వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఏసుక్రీస్తు
అదే విధంగా ఏడవడం కన్నీరు పెట్టడం మనం
చూస్తాము మనకందరికీ నొప్పి కలిగినప్పుడు
మనకందరికీ గాయం అయినప్పుడు రక్తం వస్తుంది
అలాగే దేవుడు కూడా మనిషిగా దిగి వచ్చిన
తర్వాత ఆయనకు మేకులు కొట్టినప్పుడు ఆయనకి
రక్తం వచ్చింది అంటే ఒక రకంగా చెప్పాలి
అని అంటే ఒక మనిషి ఎన్ని రకాల బాధలు అయితే
పడతాడో యేసు క్రీస్తు ఆల్మోస్ట్ అన్ని
రకాల బాధలను ఆయన ఈ లోకమున ఈ లోకంలోకి
వచ్చి అనుభవించి వెళ్ళాడు ఆయన శోధింపబడి
వెదనొందెను ఆయన శోధించబడ్డాడు మనలాగే
మనలాగే మన దగ్గరికి సైతాను వచ్చి ఫలానా
పాపం చెయ్యి అని ఏ విధంగా ప్రేరేపిస్తాడో
అలాగా ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్లి కూడా
ప్రేరేపించాడు మనమేమో పడిపోతున్నాము
ఏసుక్రీస్తు నిలబడగలిగాడు ఆయన శోధింపబడి
వెదనొందెను గనుక ఆయన శోధింపబడు వారికి
సహాయపడగలడు ఆయనకి ఇలాంటి సిట్యువేషన్స్
అన్ని తెలుసు ఒక ఒక మనిషిని కోల్పోతే ఎలా
ఉంటుందో తెలుసు ఎందుకని అంటే
ఏసుక్రీస్తుకు సాకుడు తండ్రిగా ఉన్నటువంటి
జోసెఫ్ గారు కూడా చనిపోయారు ఆయన
చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు మీద కుటుంబ
భారం పడింది తన తల్లిని చూసుకోవాల్సిన
బాధ్యత ఆయన మీద ఉంది సో మన ఇంట్లో ఏ
విధంగా అయితే ఒక పెద్ద కుమారుడో లేదా
తండ్రి ఏ విధంగా బాధ్యతలను స్వీకరిస్తాడో
ఏసుక్రీస్తు కూడా అలాగే బాధ్యతలను
స్వీకరిస్తున్నాడు ఏసుక్రీస్తు సిలువ మీద
మరణించబోతున్నాడు తన తల్లిని
చూసుకునేటువంటి వారు లేరు వెంటనే
శిష్యుడికి అప్పగించాడు తన తల్లిని అంటే ఈ
లోకంలో ఏ ఏ రకాల బాధ్యతలు అయితే ఉంటాయో
అవన్నీ ఏసుక్రీస్తు కూడా అనుభవించాడు గనుక
ఇవాళ మనం ఇలాంటి శోధనల్లో ఉంటే ఇలాంటి
కష్టాల్లో ఉంటే ఇలాంటి బాధల్లో ఉంటే
ఏసుక్రీస్తు వాటిని క్లియర్ గా అర్థం
చేసుకోగలడు దేవుడు అంటే పరలోకంలో ఉండి ఓకే
నీకు ఈ కష్టం వచ్చిందా నువ్వు ఈ పని చెయ్
నువ్వు నువ్వు దీని గురించి ప్రార్థన
చేస్తున్నావా సరే నేను నీకు ఇది ఇస్తా పో
అని పరలోకంలో ఉండి ఆజ్ఞలు వేసేటువంటి
వ్యక్తి కాదు మన దేవుడు బదులుగా ఆయన
మనిషిగా మారాడు మనిషిగా మారి మనం ఎన్ని
రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కొంటామో ఏ
ఇబ్బందుల గుండా వెళ్తామో ఏ పరిస్థితులను
మనం కృంగదీస్తాయో ఆ పరిస్థితులన్నింటి
గుండా ఏసుక్రీస్తు వెళ్ళాడు గనుక ఇప్పుడు
మనకు ఆయన సహాయం చేయగలడు ఏ విధంగా సహాయం
చేయగలడు అని అంటే మన బాధని ఆయన అర్థం
చేసుకోగలడు అంత లోతుకు దిగి మరి అర్థం
చేసుకోవడానికి ఏసుక్రీస్తు ముందుకు
వచ్చాడు అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి
ఇప్పుడు ఈ హెబ్రీయులకు రాసినటువంటి లేఖను
గమనిస్తే అనేక విషయాలు చెప్పాడు
ఏమంటున్నాడు ఏసుక్రీస్తు మనలాగే మనిషి
అయ్యాడు బాగానే ఉంది ఏసుక్రీస్తు మనలాగే ఆ
అనేక ఇబ్బందులని ఎదుర్కొన్నాడు ఓకే బాగానే
ఉంది ఆయన ప్రధాన యాజకుడు లాగా ఆయన మారాడు
చేసినటువంటి ఆనాటి యాజకులు చేసినటువంటి
తప్పులన్నింటిని ఆ ఈయన సరిదిద్దాడు ఓకే
బాగానే ఉంది మరి ఇదంతా ఎందుకు
చెప్తున్నాడు మనకి ఇది చెప్పడం వల్ల మనకు
వచ్చినటువంటి లాభం ఏంటి అనేది గమనించాలి
ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తే దీనికి మనం
కొంచెం బ్యాక్ గ్రౌండ్ అర్థం చేసుకోవాలి
మొట్టమొదటగా క్రైస్తవులుగా పిలవబడినటువంటి
వ్యక్తులు లేదా క్రైస్తవులుగా మారిన
వ్యక్తులందరూ కూడా యూదులే ఏసుక్రీస్తు
యూదా అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి
వ్యక్తి ఏసుక్రీస్తు సువార్త ప్రబోధం
మొదలు పెట్టినప్పుడు ఏసుక్రీస్తును
అనుసరించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ
యూదా పరిసర ప్రాంతాలకు చెందినటువంటి
వ్యక్తులు అంటే ఇజ్రాయిల్ దేశానికి
చెందినటువంటి వ్యక్తులే మొదటగా
ఏసుక్రీస్తును అనుసరించారు వాళ్ళు
క్రైస్తవులు అయ్యారు ఏసుక్రీస్తును
అనుసరించారు కాబట్టి ఆ యూదులందరూ కూడా
క్రైస్తవులు అయ్యారు ఇప్పుడు ఏమైంది అంటే
ఆనాడు ఏసుక్రీస్తు కాలంలో ఇజ్రాయిల్
దేశాన్ని రోమా అనేటువంటి సామ్రాజ్యం
పరిపాలిస్తూ ఉంది ఆ రోమా సామ్రాజ్యానికి
యూదులు ఎవరో తెలుసు కానీ క్రైస్తవులు
అప్పుడప్పుడే పుట్టుకొస్తున్నారు అందువల్ల
రోమన్లకు కూడా క్రైస్తవులు అంటే శత్రువులు
అయ్యారు ఒకవైపు యూదులు వీళ్ళని
ద్వేషిస్తున్నారు క్రైస్తవులని ఇంకోవైపు
రోమన్ అధికారులు కూడా క్రైస్తవులను
ద్వేషిస్తున్నారు రెండు వైపులా ద్వేషం
పెరుగుతుంది క్రైస్తవులు అని అంటే అటు
యూదులు కోప్పడుతున్నారు ఇటు రోమన్లు
కోప్పడుతున్నారు ఆ సమయంలో కొంతమంది ఆ
యూదులు తిరిగి యూదా మతానికి వెళ్ళిపోవాలి
మేము క్రీస్తును అనుసరించకూడదు అని
అనుకున్నారు ఎందుకంటే క్రైస్తవులు
గురించినటువంటి పూర్తి విషయాలు ఆ రోజు
వాళ్ళకి తెలియదు ఈరోజు అంటే మనకు బైబిల్
ఉంది హెబ్రీయులకు రాసిన లేఖ ఉంది లేకపోతే
ఇతర సువార్తలు ఉన్నాయి వీటన్నిటి వల్ల
మనకు ఏసుక్రీస్తు ఎవరు యూదా మతానికి
ఏసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలకు తేడా
ఏమిటి దానికి దీనికి సంబంధం ఏంటి
అనేటువంటి విషయాలు మనకు తెలుసు కానీ ఆనాటి
యూదులకు అవి తెలియదు తెలియకపోవడంతో
వాళ్ళందరూ తిరిగి మేము పాత యూదా మతంలోకి
వెళ్ళిపోతాము అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు
అలా భావిస్తూ ఉన్నటువంటి క్రమంలో యేసు
క్రీస్తు పాత నిబంధనకి ఒక నెరవేర్పు ఆయన
వచ్చిందే పాత నిబంధనను నెరవేర్చడానికి మనం
ఏసుక్రీస్తులో ఉంటేనే పాత నిబంధనను
పూర్తిగా పాటించినట్లు అని చెప్పడానికి ఈ
హెబ్రీయులకు రాసినటువంటి లేఖని ఆనాటి
పెద్దలు రాశారు దాన్ని ఉపయోగించుకున్నారు
ఇంకొకటి ఏంటంటే యూదులకు కూడా ఫిలాసఫీ ఉంది
యూదుల యొక్క తత్వశాస్త్రం ప్రకారం మనుషులు
ఎదుర్కొనేటువంటి అతి పెద్ద శత్రువు ఏంటి
అని అంటే మరణం ఈరోజు మనకు కూడా ఒక రకంగా
అతి పెద్ద శత్రువు మరణమే ఇప్పుడు ఆ తర్వాత
యూదుల్లో ఇంకా గమనించినట్లయితే యూదులకు
కొంతమంది పవిత్రమైనటువంటి వ్యక్తులు
ఉన్నారు ఎవరు యూదులకి దేవదూతలు అని అంటే
పవిత్రమైన వ్యక్తులు ఆ తర్వాత యూదులు
కట్టుకున్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో అది
పవిత్రమైనది ఆ దేవాలయంలో అర్పించే బలి
ఏదైతే ఉందో అది పవిత్రమైనది ఆ బలిని
అర్పించేటువంటి ప్రధాన యాజకులు ఎవరైతే
ఉంటారో వాళ్ళు మంచి వాళ్ళు పవిత్రులు అని
భావించేవారు గౌరవం ఇచ్చేవారు అలాగే
ఆదివారం శనివారం రాగానే శబ్బాత్ అని అది
దేవుని కొరకు కేటాయించిన రోజు అని
భావించుకునే వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి
పవిత్రమైనవి అంటే ఏది దేవదూతలు దేవాలయము
దేవాలయంలో అర్పించే బలులు ఆ తర్వాత ప్రధాన
యాజకుడు ఇతర యాజకులు శబ్బాత్ అనేటువంటి ఆ
పవిత్రమైన రోజు లేదా ఇతర పండుగలు ఇవన్నీ
వాళ్లకు పవిత్రమైనవి ఇప్పుడు ఏమంటున్నాడు
అంటే హెబ్రీయులకు రాసినటువంటి లేఖ
చెబుతున్నది ఏంటంటే ఏసుక్రీస్తు
వీటన్నింటికంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి
ఏసుక్రీస్తులో ఇవన్నీ నెరవేరుతున్నాయి ఏ
విధంగా ఏసుక్రీస్తు ఒక రకంగా దేవదూత
దేవుని నుంచి మనకు సందేశాన్ని తీసుకొని
వచ్చిన దేవదూత ఆయనే యేసుక్రీస్తే ఒక రకంగా
దేవాలయం ఎందుకని అంటే ఆ దేవాలయంలోనే మనం
ప్రార్థనలు చేస్తున్నాము ఆ దేవాలయంలోనే
మనం భాగమై ఉన్నాము ఆయన ఒక రకంగా దేవాలయం ఆ
దేవాలయంలో బలిగా అర్పించబడినటువంటి
వ్యక్తి కూడా ఏసుక్రీస్తే ఏ విధంగా ఆయన
యొక్క సిలువ బలి యాగం ద్వారా ఆయనే బలి
గొర్రెపిల్లగా మారాడు ఆ తర్వాత ఆయనే
ప్రధాన యాజకుడు ఇవాళ రీడింగ్ లో మనం
చదివింది అదే ప్రధానంగా ఏసుక్రీస్తు
విశ్వసనీయుడును దయామయుడైనటువంటి
ఆ ప్రధాన యాజకుడిగా మనకు కనిపిస్తూ
ఉన్నాడు సో ప్రధాన యాజకుడి రోలు
ఏసుక్రీస్తులో నెరవేరింది అలాగే శబ్బాతు
అనేటువంటి పవిత్ర దినం ఉంది ఏసుక్రీస్తు
కూడా మాట్లాడుతూ ఒకచోట అంటాడు విశ్రాంతి
దినమునకు అధిపతి నేనే అని చెప్తాడు నేనే
విశ్రాంతి దినానికి అధిపతిని అంటే ఆ
శబ్బాతు ఏదైతే ఉందో ఆ శబ్బాతుకి దేవుణ్ణి
నేను శబ్బాతుకి ప్రభువునే నేను అని ఆ
శబ్బాతును కూడా ఏసుక్రీస్తు నెరవేర్చడం
మనం చూస్తున్నాం అంటే యూదులు ఏవైతే
పాతకాలం నుంచి పాటించుకుంటూ వస్తున్నారో
అవన్నీ ఏసుక్రీస్తులో నెరవేరాయి కాబట్టి
ఏసుక్రీస్తులో ఉండటమే
అసలైనటువంటి ఆ యూదా ఒప్పందము యూదులకి
దేవునికి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి
అని అంటే ఏసుక్రీస్తులో ఉండడమే అని
చెప్పడము ఈ హెబ్రీయులకు రాసినటువంటి లేఖ
యొక్క ప్రధాన ఉద్దేశం ఇకపోతే సువార్త
పట్టణంలో ఇవాళ మనం చూస్తున్నాము లూకా
సువార్త రెండవ అధ్యాయము 22 నుంచి 40 వ
వచనం వరకు చూస్తున్నాము ఈ లూకా సువార్తను
రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పునీత
లూకా గారు ఈయన ఎవరని అంటే పౌలు గారి యొక్క
శిష్యుడు పౌలు పౌలు దగ్గర దేవుని గురించి
బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత
పౌలు గారి నుంచి ఇతర అపోస్తుల నుంచి మరియ
తల్లి నుంచి సమాచారాన్ని అంతా కూడా
సేకరించి దాన్ని ఒక గ్రంధంగా రాసి ఈరోజు
మనకు అందించినటువంటి వ్యక్తి ఈ పునీత లూకా
ఏసుక్రీస్తును అనుసరించడానికి ముందు ఈ
పునీత లూకా గారు ఒక వైద్యుడిగా పని చేశారు
ఆనాటి కాలంలో ఉన్నటువంటి వైద్యం ప్రకారం
వైద్యుడిగా పని చేసినటువంటి వ్యక్తి అలాగే
ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా మనకి ఈనాటి
రీడింగ్స్ లో కనిపిస్తున్నారు లూకా
సువార్త రెండవ అధ్యాయంలో ఇంకొక ఇద్దరు
వ్యక్తులు కనపడుతున్నారు అందులో ఒక మగ
ప్రవక్త ఇంకొక ఆడ ప్రవక్తి కనిపించడం మనకు
చూస్తున్నాం అందులో మొదటి వ్యక్తి మగ
ప్రవక్త ఎవరు అని అంటే సిమియోను అనేటువంటి
ప్రవక్త ఈ సిమియోను అనేటువంటి పేరే కొన్ని
మార్పులు చేర్పులై మనకు కనిపిస్తూ ఉంటుంది
సిమియోను అన్నా సీమోను అన్నా రెండు ఒకటే
రెండిటి నుంచి ఆ రెండిటి యొక్క మూలం ఒకటే
ఇంకా మనం పాతని నిబంధనలో చూసినట్లయితే 12
మంది మూల పురుషులు ఉన్నారు అందులో
షిమ్యోను అనేటువంటి ఒక తెగ ఉండేది
షిమ్యోను అని పిలిచేవారు అంటే యాకోబు
కుమారుల్లో అతను కూడా ఒకడు ఆ షిమ్యోను
అనేటువంటి పేరు దగ్గర నుంచి మొదలు
పెట్టుకొని వచ్చాయి అన్నమాట ఇవన్నీ మన
పేతురు గారి పేరు కూడా సీమోను అని
పిలుస్తూ ఉంటారు సో ఈ సిమియోను ఆ సీమోను
రెండు ఒకటే పాత నిబంధనలో ఉన్నటువంటి
సిమియోను అనేటువంటి జాతి కూడా ఒకటి ఉంది
అని గుర్తుపెట్టుకోవాలి ఈ సిమియోను
అనేటువంటి ప్రవక్త గురించి బైబిల్
మాట్లాడుతూ అతడిని నీతి నీతిమంతుడిగా
చెప్పింది పవిత్రాత్మతో నింపబడినటువంటి
వ్యక్తి అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం
బైబిల్ లో కొన్నిసార్లు నీతిమంతుడు అని
రాయబడుతుంది ఉదాహరణకి మన జోసెఫ్ గారు అంటే
ఏసుక్రీస్తు యొక్క తండ్రి గారు అయినటువంటి
యోసేపు గారు కూడా నీతిమంతుడు అని పిలవడం
మనం చూస్తాం ఇక్కడ సిమియోను కూడా
నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు మరి
నీతిమంతుడు అంటే ఏంటి మనకు డౌట్ వచ్చి
ఉంటుంది నీతిమంతుడు అని అంటే తాను
చేసినటువంటి తప్పులను పాపాలను దేవుని ఎదుట
ఒప్పుకునేటువంటి వ్యక్తిని పాత నిబంధనలో
లేదా పరిభాషలో నీతిమంతుడు అని పిలిచేవారు
అంటే వాళ్ళు తప్పులు చేయరని అర్థం కాదు
ఒకవేళ తప్పులు చేస్తే వాటిని వెంటనే
గుర్తించి దేవుని దగ్గరకు వెళ్లి
క్షమాపణలు అడిగేటువంటి వ్యక్తులనే
నీతిమంతులు అని పిలుస్తూ ఉంటారు కాబట్టి
మనం కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి
అని అంటే సాధ్యమైనంత ఎక్కువగా మనం
దేవాలయానికి వెళుతూ అక్కడ మనము ఆ ఈ మనకు
ఉన్నటువంటి పాప క్షమాపణ సంస్కారం ఉంది కదా
దాని ద్వారా మన పాపాలను ఒప్పుకుంటూ
నీతిమంతులుగా దేవుని సన్నిధిలో జీవిస్తూ
ఉండాలి తద్వారా మనం పవిత్రాత్మను
పొందుకొని ఉంటాము ఎవరైతే నీతిమంతులుగా
ఉంటారో తమ పాపాలను ఎప్పటికప్పుడు దేవుని
దగ్గర ఒప్పుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా
పవిత్రాత్మతో నింపబడి ఉంటారని మనకి ఇక్కడ
కనిపిస్తూ ఉంది ఆ తర్వాత అన్నమ్మ
అనేటువంటి ప్రవక్తి కూడా మనకి ఇక్కడ
కనిపిస్తూ ఉంది ఈ అన్నమ్మ అనేటువంటి
ప్రవక్తి పెళ్లి అయిన తర్వాత ఒక ఏడు
సంవత్సరాలు తన భర్తతో కలిసి కాపురం
చేసింది అయితే ఏడు సంవత్సరాల తర్వాత భర్త
మరణించడంతో ఆమె విధవరాలు అయింది విధవరాలు
అయిన తర్వాత 84 సంవత్సరాల పాటు ఆ
దేవాలయంలోనే ఉండి దేవాలయంలో రేయింబులు
దేవుని యొక్క సేవలో నిమగ్నమై ఉండేది ఆ
దేవాలయంలో ప్రార్థనలు చేయడము దేవాలయాన్ని
శుభ్రం చేయడము ఇలాంటి పనులన్నీ
చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకి అన్నమ్మ
అనేటువంటి ప్రవక్త కనిపిస్తూ ఉంది సో
సిమియోను ప్రవక్త అన్నమ్మ అనేటువంటి
ప్రవక్త వీళ్ళిద్దరూ కూడా ఇవాళ రీడింగ్స్
లో మనకు కనిపిస్తున్నారు అసలు ఇవాళ
రీడింగ్స్ లో ఏముంది అని
గమనించినట్లయితే ఇవాళ రీడింగ్స్ లో టూకిగా
ఉన్నది చెప్పాలి అని అంటే ఇశ్రాయేలు యొక్క
ఆచారం ప్రకారం ప్రకారము 40 రోజులు గడిచిన
తర్వాత అంటే బిడ్డ పుట్టిన 40 రోజుల
తర్వాత ఆ తల్లి ఎవరైతే ఉంటదో ఆ తల్లి తన
బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళాలి
దేవాలయానికి వెళ్లి అక్కడ ఒక బలిని
అర్పించాలి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని
బట్టి ఏదో ఒక రకమైనటువంటి బలిని
అర్పించాలి అలా బలిని అర్పిస్తే వారు ఆ ఆ
గర్భం ధరించి బిడ్డను కన్నటువంటి ఆ
పీరియడ్ ఏదైతే ఉందో అది ముగిసినట్టు
అఫీషియల్ గా మన భారతదేశ సమాజంలో కూడా
చూస్తూ ఉంటాము పెళ్లి అయిన తర్వాత ఏడు
రోజులకో 12 రోజులకో ఈ స్నానాలు అనేటువంటి
కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇది
కూడా సుమారు అలాంటి ఆలోచనే అని చెప్పొచ్చు
యూదుల పరిభాషలో అది ఒక ఆచారము 40 రోజుల
తర్వాత వాళ్ళు స్నానం చేసి వెళ్లి
దేవాలయానికి వెళ్లి బలి అర్పిస్తారు
అంతటితో ఆ గర్భవతిగా ఉండి బిడ్డను
కన్నటువంటి రోజులు ఏవైతే ఉంటాయో అవి
పూర్తయి ఇక సాధారణమైనటువంటి స్త్రీగా
జీవిస్తూ ఉంటారు అన్నమాట అది జరిగేది ఇవాళ
రీడింగ్స్ లో ఏముందని గమనించినట్లయితే
ఏసుక్రీస్తుని మరియ తల్లి జోసెఫ్ గారు
కలిసి దేవాలయానికి తీసుకొని వెళ్లారు
అక్కడ మరియ తల్లి జోసెఫ్ లు కలిసి ఒక
బలిని అర్పించడం మనం చూస్తున్నాం
రీడింగ్స్ లో ఈ విధంగా ఉంది చదువుతున్నాను
మోషే చట్టం ప్రకారం వారు శుద్ధిగా
ఉంచుకొనవలసిన దినములు వచ్చినవి ప్రతి
తొలిచూలు మగబిడ్డ దేవునికే
అర్పింపబడవలయును అని ప్రభువు
ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ
యోసేపులు బాలున్ని ఎరుషలేమునకు తీసుకొని
పోయిరి చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను
రెండు పావురముల పిల్లలైనను బలి సమర్పణ
చేయుటకు అచటకు వెళ్ళిరి ఇది మీకు అర్థం
కాకపోతే సింపుల్ గా అర్థమయ్యేలాగా
చెప్తాను మోషే అనేటువంటి ఒక చట్టం మనకు
కనిపిస్తూ ఉంది మోషే ఇచ్చినటువంటి చట్టం
మనకు కనిపిస్తుంది దానిని మనము
ధర్మశాస్త్రము అని పిలుస్తాము లేదా బైబిల్
లో మొదటి ఐదు పుస్తకాలు ఆదికాండం నుంచి
ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి
పుస్తకాలని మోషే చట్టము అని పిలుస్తారు
లేదా కొన్నిసార్లు తోర అని కూడా పిలుస్తూ
ఉంటారు సో ఆ మోషే చట్టంలో కొన్ని నియమాలు
ఉన్నాయి ఆ నియమాలు ఏంటి అని అంటే మొదటగా
బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఎనిమిదవ రోజున
సున్నతి చేయించాలి ఆ బిడ్డకి ఆ తర్వాత 40
రోజులు గడిచాక తల్లిదండ్రి ఆ బిడ్డను
తీసుకొని దేవాలయానికి వెళ్లి మళ్ళీ బలి
అర్పించాలి అప్పుడు అప్పటివరకు అపవిత్రంగా
ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ తర్వాత ఇక సమాజంలో
మిగిలిన అన్ని పనుల్లో కూడా భాగమైపోవచ్చు
అది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ఆచారము
లేదా చట్టము సో దాన్ని నెరవేర్చడానికి
మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి
గావించుకున్న దినములు వచ్చినవి అంటే 40
రోజులు అయింది వాళ్ళు ఇప్పుడు శుద్ధి
చేసుకోవాలి శుద్ధి చేసుకోవడం అంటే వెళ్లి
బలి అర్పిస్తే ఇక జనసామాన్యంలో
కలిసిపోవచ్చు వాళ్ళు అలాంటి రోజులు
వచ్చాయి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి
అర్పింపబడవలెను అని ప్రభువు
ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు అంటే
వాళ్ళకి ఇంకొక ఆజ్ఞ కూడా ఉంది అదేంటంటే
ఇశ్రాయేలు దేశంలో ఎవరికైనా మగపిల్లాడు
పుడితే మొట్టమొదటిసారి అంటే తొలి బిడ్డగా
మగబిడ్డ పుట్టారు అని అంటే ఆ మగబిడ్డని
వీళ్ళు ఏం చేయాలంటే తల్లిదండ్రులు
దేవాలయంలో సమర్పించాలి అంటే ఒక ఒక సింపుల్
పరిభాషలో చెప్పాలని అంటే ఇశ్రాయేలు దేశంలో
ఆ గర్భములో తొలిగా పుట్టేటువంటి ప్రతి
మగబిడ్డ దేవునికే అర్పితం అతన్ని దేవునికి
వదిలేయాలి పూర్తిగా అయితే అక్కడ ఇంకొక
ఆచారం కూడా ఉంది దేవునికి వదిలేయకూడదు అని
అనుకుంటే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో
వాళ్ళు దేవాలయానికి ఆ బిడ్డను తీసుకొని
వెళ్లి ఆ బిడ్డకు బదులుగా ఐదు శకెలు అనేవి
ఇచ్చేవారు శకెలు అని అంటే ఒక 11 గ్రాముల
బంగారం ఇప్పుడు 11 గ్రాముల వెండి బంగారం
కాదు వెండి ఇప్పుడు మనం బంగారాన్ని
కొనేటప్పుడు 10 గ్రాములు కొంటూ ఉంటాం
సాధారణంగా ఒక 10 గ్రాములు లేదంటే ఒక కాసు
అనో లేకపోతే ఇది ఎన్ని తులాలు అని చెబుతూ
ఉంటాం కదా సో ఆ విధంగా ఒక తులం అనుకోండి ఆ
విధంగా ఐదు తులాలన వెండిని వాళ్ళు అక్కడ
అర్పించాలి దేవాలయంలో అలా వెండిని వాళ్ళు
దేవాలయంలో ఇస్తే ఆ బిడ్డని ఇంటికి
తెచ్చేసుకోవచ్చు ఒకవేళ అలా ఇవ్వకపోతే ఆ
బిడ్డని దేవాలయంలోనే వదిలేసి రావాలన్నమాట
అది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారం అదే
ఇక్కడ చెప్తున్నాడు లూకా సువార్తలో ప్రతి
తొలిచూలు మగబిడ్డ దేవునికి
అర్పింపబడవలయును ఆ విధంగా అర్పించబడాలి
ఒకవేళ అర్పించకూడదు అని అనుకుంటే ఏం
చేయాలంటే బిడ్డను దేవుని దగ్గర నుంచి
విడిపించుకోవాలి అలా విడిపించుకోవాలి అని
అంటే కొంత వెండిని ఆ రోజుల్లో దేవాలయంలో
ఇవ్వాలి అన్నమాట అది ఆ రోజుల్లో దేవాలయంలో
ఉన్నటువంటి యాజకులను పోషించడానికి దేవుడు
పెట్టినటువంటి ఒక నియమము అలాగే వాళ్ళు
ఈజిప్టు నుంచి బయటకు తీసుకొని
వచ్చేటప్పుడు ఇశ్రాయేలు తొలి బిడ్డలు ఎవరు
చనిపోలేదు అందువల్ల ఆయనకు గుర్తుగా
పుట్టినటువంటి ప్రతి మగబిడ్డ దేవునికి
సమర్పితుడు అనేటువంటి ఆచారం ఆ రోజుల్లో
ఉండేది సో ఆ విధంగా వాళ్ళు బలి
అర్పించడానికి దేవాలయానికి వెళ్లారు
మరియమ్మ జోజపులు కలిసి రెండు పావురాలని
బలి అర్పించారు సాధారణంగా ఆ రోజుల్లో బాగా
డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే
ఆ ఎద్దుల లాంటి పెద్ద జంతువులను తీసుకొని
వచ్చి బలి అర్పిస్తారు ఒకవేళ మధ్యస్థంగా
డబ్బులు ఉన్న వాళ్ళు అయితే గొర్రెపిల్లను
తీసుకొని వచ్చి బలి అర్పిస్తారు ఇక బాగా
పేదవాళ్ళు అయితే రెండు పావురాలను
అర్పిస్తారు లేదా ఇంకా కొంచెం పేదవాళ్ళు
అయితే ధాన్యాన్ని అర్పిస్తారు గోధుమ పిండి
ఇలాంటి వాటిని తీసుకొని వచ్చి బలిగా
అర్పిస్తూ ఉంటారు ఇక్కడ మరియ తల్లిని కూడా
మనం గమనించినట్లయితే రెండు పావుర పిల్లలను
తీసుకొని వచ్చి బలి అర్పించారు అంటే మరియ
తల్లి యొక్క స్థితి మరియ తల్లి జోసోఫల
యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాంటిది అని అంటే
చాలా పేదవాళ్ళు వాళ్ళు అంటే ఇంకా
ఆల్మోస్ట్ ఆ ఏదో రోజు వారి కష్టం చేసుకొని
బతకాలి అనేటువంటి స్టేజిలోనే బతికినటువంటి
వ్యక్తులు మరియ తల్లి జోసెఫ్ అంటే ఈ
అర్పించినటువంటి బలిని బట్టి వారు వాళ్ళ
యొక్క ఆర్థిక స్థితిని మనం అంచనా వేయొచ్చు
సో ఆ విధంగా మరియ తల్లి వచ్చింది ఆమె బలి
అర్పించింది బలి అర్పించిన తర్వాత ఇద్దరు
వ్యక్తులు వచ్చి మాట్లాడటం మనం
గమనిస్తున్నాము ఇక్కడే మనం చూసినట్లయితే
ఎరుషలేములో సిమియోను అనేటువంటి ప్రవక్త
వచ్చి మాట్లాడుతున్నాడు ఆ ప్రవక్తకి
దేవుడు విషయాన్ని తెలియజేశాడు ఏమని అంటే
నేను నీకు నా రక్షణను చూపిస్తాను
అప్పటివరకు నువ్వు మరణించవు అని చెప్పడం
మనం చూస్తున్నాము అప్పుడు ఆ సిమియోను
వచ్చి మాట్లాడుతున్నాడు ఏమని చూడండి
ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను
నేను కన్నులారా గాంచితిని ఇది అన్యులకు
మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు
ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు
మీకు గుర్తుందో లేదో రెండు వారాల క్రితం
మనము యెషయా గ్రంధం నుంచి చదివాం యెషయా
గ్రంథం 62 వ అధ్యాయంలో చూసాం ఎరుషలేము
అంతా కూడా నల్లగా మాడిపోయి ఉంది ఆ పంట
పొలాలను నాశనం చేశారు ఇళ్లను నాశనం చేశారు
దేవాలయాన్ని నిప్పు పెట్టి తగలబెట్టారు
దానివల్ల పట్టణం అంతా నల్లగా అయిపోయి ఉంది
అయితే దేవుడు అప్పుడు వాళ్ళకి వాగ్దానం
చేశాడు నీ పట్టణం తరపున నేను మాట్లాడుతాను
నీ పట్టణాన్ని తిరిగి నిర్మించబోతున్నాను
నీ పట్టణంలో మళ్ళీ ప్రజలందరూ వచ్చి
జీవిస్తారు నీ పట్టణం యొక్క మహిమ అనేది
తిరిగి ప్రజలందరికీ కనపడబోతుంది రాజులందరూ
నీ దగ్గరికి రాబోతున్నారు అని మనం
చదువుకున్నాము ఇప్పుడు సిమియోను ప్రవక్త
చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా దానికే
నెరవేర్పు ఏమంటున్నాడు చూడండి ప్రజలందరి
ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను
కన్నులారా గాంచితిని దేవుడు చెబుతూ వస్తూ
ఉన్నటువంటి మాట ఏమిటి నేను మిమ్మల్ని
రక్షిస్తాను
మీరు ఆ దేవా అక్కడికి వెళ్లి బబులోనుకు
వెళ్లి ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చారు
కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను
అని చెప్పడం చూస్తున్నాము ఇక్కడ సిమియోను
ప్రవక్త అదే అంటున్నాడు ఏమని రక్షణను
కన్నులారా గాంచితిని ఇక్కడ రక్షణ
అనేటువంటి మాటకి ఏసుక్రీస్తుకు కూడా దగ్గర
సంబంధం ఉంది ఏసుక్రీస్తు అనేటువంటి పేరు
మనం తెలుగులో మాట్లాడుతున్నాం కానీ హిబ్రూ
భాషలో అంటే ఏసుక్రీస్తు మాట్లాడినటువంటి
భాషలో ఆయన పేరు యాషువా అని పిలుస్తారు
అందులో యాహ్ అంటే యావే దేవుడు అని షువ
అంటే రక్షకుడు అని యాషువా అంటే
ఏసుక్రీస్తుకి యూదుల పరిభాషలో అర్థం ఏమిటి
అని అంటే యాషువా అంటే యావే దేవుడే
రక్షకుడు ఇప్పుడు ఏసుక్రీస్తులో కూడా
నెరవేరుతున్నది ఏంటి అని అంటే నీవు
ఏర్పరచిన రక్షణను నేను కన్నులారా
గాంచితిని అంటే దేవుడే రక్షకుడిగా వచ్చాడు
ఇక్కడ రక్షణని అందిస్తున్నాడు అని మనం
అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఇది అన్యులకు
మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు
ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు
యేసుక్రీస్తు
రావడంతోనే ఇశ్రాయేలీయులందరికీ కూడా మహిమ
వచ్చింది ఎందుకు అని అంటే ఈయన ఒక వెలుగు
అన్యులకు మార్గదర్శకమగు వెలుగు ఇప్పుడు
మనం ఇందాకే మాట్లాడుకుంటూ మన మలాకి
ప్రవక్త చెప్పినటువంటి మాటను మనం విన్నాం
ఏమని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం
వరకు నా నామము వివిధ జాతులలో ఘనముగా
ఎంచబడును వివిధ జాతులలో అంటే ప్రపంచానికి
సంబంధించినటువంటి అన్ని జాతులకి దేవుని
యొక్క పేరు అనేది పవిత్రంగా మారబోతుంది
అని ఏసుక్రీస్తుకు దాన్ని అన్వయిస్తూ
అన్యులకు మార్గదర్శకమగు వెలుగు అంటే ఇది
ఏసుక్రీస్తు వచ్చింది కేవలం ఇశ్రాయేలీయుల
కొరకు మాత్రమే కాదు అన్యుల కొరకు కూడా
వచ్చాడు అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ
ఉన్నాము అంతేకాదు ఏసుక్రీస్తే స్వయాన ఏమని
చెప్తాడు నేనే వెలుగును అని చెప్పడం కూడా
మనం చూస్తున్నాము అంతేకాదు శిష్యులతో
మాట్లాడుతూ మీరు లోకానికి వెలుగై ఉన్నారు
అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం అంటే
దేవుడు వెలుగు ఆ వెలుగును మనకు అందించాడు
ఈరోజు మనం కూడా ఇతరులకు వెలుగుగా
మారాల్సినటువంటి అవసరం ఉంది అని
గుర్తుంచుకోవాలి ఆ తర్వాత అన్నమ్మ
అనేటువంటి ప్రవక్త కూడా వచ్చింది ఆమె కూడా
వచ్చి ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి
దేవునికి ధన్యవాదములు అర్పించెను ఎరుషలేము
విముక్తికై నిరీక్షించు వారందరికీ ఆ
బాలుని గురించి చెప్పసాగెను అంటే చూడండి
బబులోను వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయాన్ని
కట్టుకున్నారు కానీ వాళ్ళకి ఇంకా విముక్తి
కలగలేదు ఇప్పుడు అన్నమ్మ అనేటువంటి
ప్రవక్త వచ్చి చెబుతుంది ఏమని అంటే
ఎరుషలేము విముక్తికై నిరీక్షించు
వారందరికీ ఆ బాలుని గురించి చెప్పసాగెను
అంటే ఇదిగో మనం ఎంతో కాలం నుంచి ఎదురు
చూస్తూ ఉన్నాము యేసయ్య ప్రవక్త చెప్పాడు
దేవుడు రాబోతున్నాడు అని ఆ తర్వాత మలాకి
ప్రవక్త చెబుతున్నాడు దేవుడు రాబోతున్నాడు
అని ఇదిగో చూడండి మన కళ్ళ ముందే ఇది
నెరవేరింది ఇదిగో ఈ బాలుడు ఏసుక్రీస్తు
ఎవరైతే ఉన్నారో ఈ బాలుడే మనకు విముక్తిని
కలిగించేటువంటి వ్యక్తి ఈ బాలుడే మనకు
రక్షణ తెచ్చేటువంటి వ్యక్తి ఈ బాలుడే మనకి
మహిమను తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి అని
ఆ అన్నమ్మ అనేటువంటి ప్రవక్తి ప్రజలందరికీ
తెలియజేయడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు
మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి అసలు ఈ
మాటలన్నీ ఎందుకు చెప్తున్నారు అటు
సిమియోను కానివ్వండి ఇటు ప్రవక్తి అన్నమ్మ
ప్రవక్త ఎందుకు చెప్తున్నారు ఆ తర్వాత
మరియ తల్లి ఎందుకు వచ్చి బలులను
అర్పించారు అనేది మనం గమనించినట్లయితే
నేను ఇంతకు ముందే చెప్పాను మోషే చట్టంలో
అంటే తోరాలో రెండు నియమాలు ఉన్నాయి గర్భం
ధరించిన తర్వాత లేవీయ కాండం 12 వ అధ్యాయము
సంఖ్యాకాండం 18 వ అధ్యాయము ఈ రెండు
అధ్యాయాలు మనం గమనిస్తే గర్భము ధరించి
బిడ్డను కన్న తర్వాత ఆ కుటుంబం మీద రెండు
బాధ్యతలు ఉంటాయి అందులో ఒక బాధ్యత ఏమో ఆ
గర్భము ధరించినటువంటి స్త్రీ ఎవరైతే
ఉన్నారో ఆ స్త్రీకి సంబంధం రెండవదేమో
పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ
బిడ్డకు సంబంధం సో మొదటిది ఏంటి ఆ స్త్రీ
ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ పరిశుద్ధం
కావడానికి అంటే గర్భం ధరించిన తర్వాత
బిడ్డను కన్న తర్వాత వాళ్ళు వెంటనే వెళ్లి
ఏమైనా ఫంక్షన్స్ లో వాటిల్లో వీటిల్లో
పాల్గొనకూడదు వాళ్ళు ఎప్పుడు పాల్గొనాలి
అని అంటే 40 రోజులు గడిచిన తర్వాత వాళ్ళు
దేవాలయానికి వచ్చి దేవాలయంలో బలి అర్పించి
వాళ్ళు శుద్ధి చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా
ఉన్నారు ఇక సమాజంలో తిరగొచ్చు అని ఆ రోజు
ఉన్నటువంటి ఆచారాల ప్రకారం వాళ్ళు
నియమించుకున్న తర్వాత వాళ్ళు వెళ్లి
సమాజంలో కలిసేటువంటి వారు సో ఇక్కడ ఆ
స్త్రీ పరిశుద్ధం కావాలి అనడానికి ఒక బలి
అర్పించాలి అది బలి అర్పించడానికే మరియ
తల్లి ఒక పావురాన్ని తీసుకొని వెళ్లి
పావురాల యొక్క జంటను తీసుకొని వెళ్లి
అర్పించడం మనం చూస్తున్నాం ఇకపోతే రెండవది
గమనించినట్లయితే మగబిడ్డ ఎవరైతే పుట్టారో
ఆ బిడ్డను తీసుకొని వెళ్లి వెంటనే
దేవునికి అర్పించాలి
దేవుని దగ్గర నుంచి ఆ బిడ్డను
కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని అంటే
వాళ్ళు ఐదు శకెలు ఇవ్వాలి శకెలు అని అంటే
నేను ఇంతకు ముందే చెప్పాను 11 గ్రాముల
వెండి ఆ వెండిని 50 గ్రాములు లేదా 55
గ్రాముల వెండిని వాళ్ళు దేవాలయంలో
సమర్పించి తమ బిడ్డను వెనక్కి తీసుకోవచ్చు
ఇశ్రాయేలులో ఉన్నటువంటి అందరూ ఇదే
పద్ధతిని ఫాలో అవుతారు దేవాలయానికి
వెళ్తారు 40 రోజులు కాగానే ఆ దేవాలయంలో ఆ
తల్లి బలి అర్పిస్తుంది ఆ తర్వాత
పుట్టినటువంటి బిడ్డ కొరకు వీళ్ళు 55 50
ఐదు సెకండ్లు ఇచ్చి అంటే 55 గ్రాముల వెండి
ఇచ్చి బిడ్డను కొనుక్కొని వెనక్కి
వచ్చేస్తారు ఇది ప్రాసెస్ కానీ మన మన
కేసులో చూసినట్లయితే ఏసుక్రీస్తు కేసులో
చూసినట్లయితే మరియ తల్లి బలి అర్పించారు
కానీ ఏసుక్రీస్తు కోసం ఐదు శకలు 55
గ్రాముల వెండి అనేది ఏసుక్రీస్తు కోసం
అర్పించలేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని
అంటే మరియ తల్లి ఏసుక్రీస్తుని కంప్లీట్
గా దేవునికి వదిలేసింది ఈ మరియ తల్లి తన
బిడ్డను కానుకగా సమర్పించి దాని గురించి
ఎందుకు మనం ఇన్ని సార్లు ఒక పండుగ
జరుపుకుంటున్నాము ఎందుకు మనం జపమాలలో ఆ
గుర్తును ధ్యానిస్తున్నాము ఎందుకని మన
దేవాలయాలకి కానుక మాత దేవాలయం అని పేర్లు
పెట్టుకుంటున్నాము ఇవన్నీ ఎందుకు
పెడుతున్నాము అని అంటే ఈ సందర్భాన్ని
గుర్తు చేసుకోవడానికి మరియ తల్లి తన
బిడ్డని పూర్తిగా దేవునికి అప్పగించేసింది
వాళ్ళు అనుకోని ఉంటే ఆ రోజు ఆ 55 గ్రాముల
వెండి ఇచ్చేసి ఏసుక్రీస్తుని వెనక్కి
తెచ్చుకునేటువంటి వారు కానీ మరియ తల్లి ఆ
పని చేయలేదు ఏసుక్రీస్తుని పూర్తిగా
దేవునికి వదిలేసింది అందుకనే ఏసుక్రీస్తు
దేవాలయంలో తప్పిపోయినటువంటి ఘటనలో మరియ
తల్లి ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్లి
అడుగుతుంది కుమారా నువ్వు ఎందుకు ఇట్లా
చేశావు నేను నీ తండ్రి వెతుకుతున్నాము నీ
కొరకు అని అంటే అప్పుడు ఏసుక్రీస్తు
ఏమన్నాడు నేను నా తండ్రి పని మీద
ఉండవలెనని మీరు ఎరుగరా అని అంటాడు అంటే
ఎందుకు అని అంటే ఏసుక్రీస్తుని
చిన్నప్పుడే పూర్తిగా మరియ తల్లి
దేవాలయానికి అర్పించేసింది దేవునికి
అర్పించేసింది కనుకనే ఏసుక్రీస్తు ఆ రోజు
నుంచి దేవునికి పూర్తిగా అంకితమై ఉన్నాడు
అనేటువంటి అంశాన్ని మనం ఎప్పుడూ కూడా
గుర్తుంచుకోవాలి ఆ సందర్భాన్ని జ్ఞాపకం
చేసుకోవడానికే మనము కానుక మాత పండగ అని
కానుక మాత దేవాలయము అని దానికి పేరు
పెట్టుకుంటాము ఆ తర్వాత ఆ మరియ తల్లి
యొక్క త్యాగాన్ని మనం కొనియాడతాము జపమాలలో
ఆ ఆమె ఆ అర్పించినటువంటి కానుకగా
సమర్పించినటువంటి సంఘటన గురించి ధ్యానం
చేస్తాము ఇవన్నీ చేస్తాము సో ఈ విధంగా
ఏసుక్రీస్తును పూర్తిగా మరియ తల్లి
దేవానికి దేవాలయానికి అర్పించేసింది
ఏసుక్రీస్తు లాగే పాత నిబంధనలో యాజకులను
కూడా ఎవరు కొనుగోలు చేయరు అంటే ఉదాహరణకి
లేవీయులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు మనం
మాట్లాడుకున్నాం పాత నిబంధనలో మలాకి
ప్రవక్త కాలంలో యాజకులు ఉన్నారు యాజకులు
అందరూ చెడిపోయి ఉన్నారు ఆ యాజకులు ఎవరైతే
ఉన్నారో ఆ యాజకులు లేవీ అనేటువంటి వంశంలో
పుట్టినటువంటి వారు వాళ్ళు పూర్తిగా
దేవునికే అంకితం వాళ్ళ తల్లిదండ్రులు కూడా
బిడ్డలను కొనుక్కోరు సో ఆ యాజకులు కూడా
దేవునికి అంకితం ఆ తర్వాత పాత నిబంధనలో
మీరు గమనిస్తే సమూయేలు అనేటువంటి పేరు
కూడా విని ఉంటారు ఆ సమూయేలు తల్లి కూడా
నాకు బిడ్డ పుడితే నేను నీకే ఇచ్చేస్తాను
దేవా అని చెప్పడం చూస్తాము బిడ్డ పుట్టిన
తర్వాత సమూయేలను తీసుకొని వెళ్లి
దేవాలయంలో అర్పించేసింది ఆమె అర్పించేసిన
తరువాత ఆ బిడ్డ కొరకు ఐదు శకెలు అనేది
ఇవ్వలేదు అంటే పాత నిబంధనలో లేవీయులను ఏ
విధంగా అర్పించే వాళ్ళు సమూయేలుని ఏ
విధంగా అర్పించారో సేమ్ అలాగే మరియ తల్లి
కూడా తన బిడ్డని దేవాలయానికి అర్పించింది
దాన్ని గుర్తు చేసుకుంటూనే కానుక మాత
పండుగ చేసుకుంటున్నాము ఈ రోజున అనేక చోట్ల
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తాము
గుంటూరు డయాసిస్ లో కూడా మనం చూస్తాము ఒక
పెద్ద పండుగను కానుక మాత దేవాలయ పండుగను
కూడా వాళ్ళు కొనియాడుతూ ఉంటారు సో ఈ
విధంగా అందుకే ఈ పండుగ వచ్చింది అనేది
గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా
గమనిస్తే ఒక రెండు మూడు విషయాలు
ఏసుక్రీస్తు వచ్చి ఒక నూతన యాజకత్వాన్ని
ఏర్పాటు చేశాడు మనం ముందే చెప్పుకున్నాం
మలాకి ప్రవక్త మాట్లాడుతూ ఏమన్నాడు ఆ
వ్యక్తి వచ్చినప్పుడు భరించగల వాడు ఎవడు
ఒకసారి చదువుదాం దాన్ని కూడా అతని ఎదుట
నిలబడగల వాడు ఎవడు అతడు చాకల వాని వంటి
సబ్బు వంటి వాడు అతడు వెండిని పుటము వేసి
శుద్ధి చేయు వాని వలె తీర్పు చెప్పును
లోహకారుడు వెండి బంగారం పుటం వేసినట్లే
ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును అని
చెప్పడం చూసాము ఏసుక్రీస్తు అన్నట్లుగానే
యాజకులందరినీ శుద్ధి చేశాడు ఏ విధంగా
శుద్ధి చేశాడు అని అంటే యాజకులు అంటే
అప్పటివరకు ఓన్లీ లేవీయులే ఉండేవారు
ఏసుక్రీస్తు ఆ వ్యవస్థను పూర్తిగా తీసేసి
12 మంది శిష్యులను ఎంచుకున్నాడు 12 మంది
శిష్యుల్లో చేపలు పట్టుకునే వారు ఉన్నారు
ఆ తర్వాత సుంకరిగా పని చేసినటువంటి
వ్యక్తి ఉన్నారు లేదా ఇతర పనులు
చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు
వాళ్ళందరినీ తీసుకొని ఒక ఆ వ్యవస్థను
మొత్తం శుద్ధి చేసి పడేసి ఈరోజు మనం
గురువుని బలి అర్పించేటువంటి గురువుని
ఏమని పిలుస్తాం అపర క్రీస్తు అని
పిలుస్తాము ఎందుకు అని అంటే ఆనాటి
యాజకత్వం తప్పులు చేసింది అందుకని ఆ
యాజకత్వాన్ని ఏసుక్రీస్తు తీసేసి ఒక నూతన
యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు మనం కడరాత్రి
విందు రోజున చూస్తాము ఏసుక్రీస్తు
గురుత్వాన్ని స్థాపించుట గురించి మనం ఆ
రోజు ప్రసంగంలో వింటాము ఏసుక్రీస్తు
శిష్యులందరిని పిలుచుకొని వాళ్ళందరికీ
యాజకత్వాన్ని ఇచ్చి గురువులుగా మార్చడం
మనం చూసాము సేమ్ అలాగే ఇవాళ గురువులందరూ
కూడా బలి అర్పిస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ
అపరక్రీస్తులుగా బలి అర్పిస్తూ ఉన్నారు
ఎందుకని అంటే ఏసుక్రీస్తు రాకముందే మలాకి
ప్రవక్త ఒక మాట అన్నాడు ఏమని జాగ్రత్తగా
వింటే ఆ మలాకి ఒకటవ అధ్యాయం 11వ వచనంలో
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నా
నామము వివిధ జాతులలో ఘనముగా ఎంచబడును వారు
ఎల్ల యెడల నాకు సాంబ్రాణి పొగ వేసి
నిర్మలమైన బలిని అర్పించెదరు అని చెప్పడం
చూసాం ఇవాళ మనం దివ్య బలి పూజను అర్పిస్తూ
ఉన్నారు మన గురువులందరూ దివ్య బలి పూజ
అర్పిస్తున్నారు మనమందరం ఆ దివ్య బలి
పూజలో పాల్గొంటూ ఉన్నాము ఆ దివ్యమైనటువంటి
బలి పూజలో బలిగా అర్పించబడుతున్నటువంటి
వ్యక్తి ఏసుక్రీస్తే ఆ స్థానములో ఉండి
బలిని అర్పిస్తూ ఉన్నది కూడా ఏసుక్రీస్తే
ఎందుకని అంటే సిలువ మీద మరణించినటువంటి ఆ
మరణాన్నే ఇక్కడ మనం దివ్య బలి పూజలో
చూస్తూ ఉన్నాము కనుక ఆ బలి ఏదైతే ఉందో
సిలువ మీద బలి అదే బలిని ఈరోజు మనం దివ్య
బలి పూజగా దేవునికి సమర్పిస్తూ ఉన్నాము
అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి
కాబట్టి ఇక్కడ బలి అర్పిస్తున్నది ఎవరు
అని అంటే ఇక్కడ మన ఫాదర్లు లేకపోతే మనకు
తెలిసినటువంటి వ్యక్తులు కాదు బదులుగా
వారి ద్వారా దేవుడే మనకి ఇక్కడ బలి
అర్పిస్తున్నాడు అందువల్ల ఇవన్నీ కూడా
నిర్మలమైనటువంటి బలి ఈ బలిలో ఎలాంటి లోపము
లేదండి ఎందుకంటే ఈ బలిలో ఉన్నటువంటి ఆ బలి
గొర్రెపిల్ల అనేది పవిత్రమైనటువంటిది
ఎందుకని అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు
ఏసుక్రీస్తు కాబట్టి ఆనాటి యాజకులు
పడిపోయారు కానీ ఈరోజు ఏసుక్రీస్తు
పడిపోవడానికి అవకాశమే లేదు అందుకనే దేవుడు
అన్నాడు యాజకులను శుద్ధి చేయును అని
చెప్పడం చూసాము నిర్మలమైన బలిని
అర్పిస్తారు అని చెప్పడం చూసాము అది
ఏసుక్రీస్తులో నెరవేరింది అదే దివ్య బలి
పూజలో నెరవేరింది మనం దివ్య బలి పూజకు
వెళుతూ ఉన్నప్పుడల్లా ఆనాడు మలాకీ ప్రవక్త
ద్వారా దేవుడు చెప్పినటువంటి
నిర్మలమైనటువంటి బలిలో ప్రవేశిస్తున్నాము
అనేటువంటి అంశాన్ని మనం ఎల్లప్పుడూ కూడా
గుర్తుంచుకోవాలి మీ అందరికీ ఆ కానుక మాత
పండుగ శుభాకాంక్షలు లేదా దేవాలయమందు
రక్షకుని సమర్పణ ఉత్సవ శుభాకాంక్షలు
UNLOCK MORE
Sign up free to access premium features
INTERACTIVE VIEWER
Watch the video with synced subtitles, adjustable overlay, and full playback control.
AI SUMMARY
Get an instant AI-generated summary of the video content, key points, and takeaways.
TRANSLATE
Translate the transcript to 100+ languages with one click. Download in any format.
MIND MAP
Visualize the transcript as an interactive mind map. Understand structure at a glance.
CHAT WITH TRANSCRIPT
Ask questions about the video content. Get answers powered by AI directly from the transcript.
GET MORE FROM YOUR TRANSCRIPTS
Sign up for free and unlock interactive viewer, AI summaries, translations, mind maps, and more. No credit card required.